14,500 మందిని రక్షించాం:మనీష్‌ తివారి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఛార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటి వరకు 14,500 మందిని రక్షించామని కేంద్ర మంతి మనీష్‌తివారి తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 145 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. సైన్యం, ప్రైవేట్‌ హెలికాప్టర్ల సహాయంతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సహాయక చర్యల్లో ఉత్తరాఖ:డ్‌ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.