16న అనంతపురంలో సీమాంధ్ర సభ: మంత్రి గంటా

విశాఖ: ఈనెల 16న అనంతపురంలో సీమాంధ్ర సభ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో అయన మాట్లాడుతూ…. ఎల్లుండి జరిగే కోర్‌కమిటీ భేటీలో తెలంగాణపై నిర్ణయం ఉండదని, తెలంగాణ ఇవ్వరన్న కచ్చితమైన సమాచారం తమకు ఉందని మంత్రి చెప్పారు. పంచాయతీ ఎన్నికల వల్ల సీమాంధ్ర సభల ఏర్పాట్ల విషయం జాప్యం జరిగినట్లు వెల్లడించారు.