17న తుది ఓటర్ల జాబితా ప్రకటన 

మహబూబాబాద్‌,మే12(జ‌నం సాక్షి): జిల్లాలోని పంచాయతీల ఓటర్ల జాబితా ముద్రణకు సిద్ధంగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి వైవీ గణెళిశ్‌ తెలిపారు. 17వ తేదీన తొలి ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకుల నుంచి ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు స్వీకరించామని అన్నారు.  జిల్లాలో మొత్తం 461 పంచాయతీల్లో 4.52లక్షల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఐతే నూతనంగా తండాలను ప్రభుత్వం పంచాయతీలుగా గుర్తించింది. దీంతో నూతనంగా ఏర్పడిన పంచాయతీలతో గ్రామాలు, శివారు కాలనీలు, తండాల్లో కొందరు ఓటర్లు తారుమారయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు, ఓటర్ల జాబితాపై సరి చూసుకోవాలని అన్నారు. అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు చేయవచ్చని ఆయన తెలిపారు.