20న విచారణకు రావాలి

ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఐఆర్‌సిటిసి కుంభకోణం కేసులో డిసెంబర్‌ 20 తేదీన వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విచారణకు హాజరుకావాలని సోమవారం ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యం కారణంగా కోర్టులో హాజరుకాలేనని చెప్పడంతో ప్రత్యేక జడ్జి అరుణ్‌ భరద్వాజ్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆసుప్రతి లేదా జైలు నుండి లాలూ వీడియో కాన్ఫరెన్స్‌ హాజరుకానున్న విషయాన్ని నిర్దారించుకోవాలని సిబిఐ, ఇడిలను కూడా ఆదేశించింది. ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్‌సిటిసి ¬టళ్ల కార్యనిర్వాహణలను అక్రమంగా ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించిన కేసులో లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌ తదితరులు బెయిల్‌ దరఖాస్తును ఇడి

వ్యతిరేకించింది. వారు పలుకుబడి గల వ్యక్తులని, తాత్కాలిక ఊరటను కలిగిస్తే విచారణను నీరుగార్చే అవకాశం ఉందని ఇడి పేర్కొంది.