2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌

` అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణను తయారుచేస్తాం
` అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు
` పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
` 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటు: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణా రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.అందుకనుగుణంగా అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి 15000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించిందని ఆయన తెలిపారు.తద్వారా పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన వెల్లడిరచారు.శనివారం హైదరాబాద్‌ లోని లకిడికాపూల్‌ వద్ద సదరన్‌ ట్రావెల్స్‌ ప్రాంతీయ కార్యాలయాన్నీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌ తో కలసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి 17 నుండి అమలులోకి వచ్చిన 2025-2030 పర్యాటక రంగం పాలసీనీ అమలు పరచి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణా రాష్ట్రాన్ని టాప్‌ 5 లో ఉంచడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ఈ పాలసీలో భాగమని ఆయన తెలిపారు.ప్రస్తుతం గుర్తింపు పొందిన పర్యాటక స్థలాలలో మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం,జలపాతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు,వారసత్వంగా గుర్తింపు పొందిన ప్రాంతాలు,ఏకోటూరిజం కేంద్రాలు,వెల్నెస్‌ కేంద్రాలతో పాటు క్రాఫ్ట్‌ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.ఇవి గాక మరో 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు రూట్‌ మ్యాప్‌ రూపొందించినట్లు ఆయన వెల్లడిరచారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తెలంగాణాకు తలమానికంగా నిలిచిపోయేలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, పాటు ప్రాంతీయ రింగ్‌ రోడ్ల వెంట డ్రై పోర్టులు,గోదావరి, కృష్ణా నదులపై రివర్‌ బెస్ట్‌ టూరిజం, నగరాలలో వాటర్‌ ఫ్రంట్‌ హబ్‌ లు వంటి ప్రత్యేకతలతో కూడిన పర్యాటక కేంద్రాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారుదేశీయ, అంతర్జాతీయ ట్రావెల్‌ సంస్థలు కుటుంబ సభ్యులతో నిర్వహించే యాత్రలకు తెలంగాణా రాష్ట్రం కేంద్రంగా నిలిచేలా పాలసి రూపొందించబడిరదన్నారు.పర్యాటక కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను వివరించి ప్రపంచస్థాయిలో నిలబడేలా చేయడం ప్రభుత్వ సంకల్పమన్నారు.అందుకు గాను పతిష్టమైన పర్యాటక కార్యవర్గాన్ని నియమించి డెస్టినేషన్‌ మేనేజ్మెంట్‌ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.సదరన్‌ ట్రావెల్స్‌ గురించి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత నమ్మకమైన నెట్‌ వర్క్‌ కలిగి ఉండి యాత్రికుల మన్ననలు పొందిన సంస్థగా పేరొందినదన్నారు.అటువంటి సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం శుభపరిణామంగా ఆయన అభివర్ణించారు.రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తాను రాష్ట్రపతి భవన్‌లో పనిచేస్తున్నపుడు ఈ సంస్థను దగ్గర ఉండి చూషనన్నారు.ఇప్పటికే ఢల్లీి,జైపూర్‌, అమరావతి లలో కార్యకలాపాలు నిర్వహి స్తున్న ఈ సంస్థ హైదరాబాద్‌ లో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్‌,రామప్ప,లక్నవరం వంటి పర్యాటక కేంద్రాల ప్రమోషన్‌ కు ఉపకరిస్తుందన్నారు.పర్యాటక రంగంలో అభివృద్ధికి గాను రూపొందించిన పాలసీలో సదరన్‌ ట్రావెల్స్‌ భాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.