వలిగొండ జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 14 మండల పరిధిలోని రేడ్ల రేపాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బందారపు బిక్షపతి అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఇందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి స్వగ్రాహానికి విచ్చేసి ఆయన కుటుంబాన్ని ఓదార్చి నేనున్నానని ధైర్యం చెబుతూ భౌతిక దేహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ మదన్ మాద లావణ్య శంకర్ గౌడ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిబ్బంది సామి దొడ్డి బిక్షపతి వేముల నాగరాజు గాడి పెళ్లి రమేష్ కందుల లింగస్వామి దేశ బోయిన నరసింహ కందుల అంజయ్య జివ్వగాని నరసింహ తదితరులు ఉన్నారు.