రఘునాథ పాలెం ఫిబ్రవరి 20(జనం సాక్షి)
మన జిల్లా కలెక్టర్ ని కలిసి ఇల్లు లేని ప్రతి జర్నలిస్టుకు అలాగే చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి మారాలని చిన్న పెద్ద అన్ని పత్రికలు పనిచేసే వారికి సమానంగా ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయాలని అలాగే దేవాదాయ శాఖలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగి శ్రీమతి సమత ను వేధించిన బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే చట్ట ప్రకారం శిక్షించాలని 192 వ సర్వే నంబర్లు సర్పంచ్ తన ఇష్టాసారంగా ప్లాట్లను అమ్ముకుంటున్నాడని దీనిపై సమగ్ర విచారణ జరపాలని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని తదితర సమస్యలపై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక భిన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక కన్వీనర్ గుంతేటి వీరభద్రం కో కన్వీనర్స్ పెరుగు వెంకటరమణ యాదవ్ ,భద్రు నాయక్,ఆర్ పి ఐ పార్టీ అధ్యక్షులు నకిరికంటి సంజీవరావు,మాల మహానాడు జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్ ,కే రామారావు మరియు ఐక్యవేదిక నాయకులు దేవప్పంగు సుదర్శన్, జంగిపల్లి రవి ,అబ్దుల్ రెహమాన్ శ్రీమతి ఉపేంద్ర శ్రీమతి రమ్య పింగిలి రమ్య తదితరులు పాల్గొన్నారు