22న ఖోఖో క్రీడాకారుల ఎంపికలు
వరంగల్,ఫిబ్రవరి20 ( జనంసాక్షి) : జిల్లా స్థాయి సబ్జూనియర్స్ ఖోఖో క్రీడాకారుల ఎంపికలు ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ తెలిపింది. ఇల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ నెహ్రూ స్టేడియంలో ఈ ఎంపికలు ఉంటాయని అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ప్రకటనలో తెలిపారు. 2001 మే 1 తర్వాత జన్మించిన వారు మాత్రమే పోటీలకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు కార్యదర్శి టి.శ్యాంప్రసాద్ను సంప్రదించాలని కోరారు.