23నుంచి ప్రధాని విదేశీ పర్యటన
న్యూఢిల్లీ,ఆగస్ట్20(జనం సాక్షి): ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. యుఎఇ, ఫ్రాన్స్ బహ్రెయిన్ తదితర దేశాల్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23, 24 తేదీల్లో ఆయన యుఎఇలో పర్యటిస్తారు. అబుదాబి యువరాజుతో మోడీ భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన అబుదాబి యువరాజుతో చర్చిస్తారు. అనంతరం ఫ్రాన్స్ లో జరిగే జి-7 సదస్సులో మోడీ పాల్గొంటారు.