కూన శ్రీశైలం గౌడ్ ను కలిసిన బిజెపి నాయకులు.

బూర్గుంపహాడ్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బూత్ సమ్మేళన సమావేశానికి విచ్చేసిన భాజపా ఎస్టి అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్ కూన శ్రీశైలం గౌడ్ ను స్థానిక బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశగాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కారం సాయికిరణ్, ఓ బి సి మండల అధ్యక్షులు వెలిశెట్టి రామారావు తదితరులు వున్నారు.