రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి బుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి…. పశ్చిమ మధ్య బంగాళఖాతం, ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో పలుచోట్ల, రాయలసీమ, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.