తొలి తీర్పును 25కి వాయిదా వేసిన న్యాయస్థానం

ఢిల్లీ: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు వెలువడుతుందని భావించిన తొలి తీర్పును జువెనైల్‌ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. నిర్భయ కేసులో అరుగురు నిందితుల్లో ఒకడైన బాలనేరస్థుడి విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం ఇవాళ వెలువరిస్తుందని భావించారు. అయితే న్యాయస్థానం తీర్పును జులై 25కి వాయిదా వేసింది.