27న మిల్లెట్ మంత్ర సదస్సు
విజయవాడ,జనవరి25(జనంసాక్షి): గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల, వినియోగదారుల ఆరోగ్య సదస్సు మిల్లెట్ మంత్ర – 2019 ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ¬టల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్స్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖాదర్ వలి పాల్గొని చిరు ధాన్యాలు విశిష్టత, పండించే పద్ధతులు, వాటిని ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.