39వ సాక్షిగా మాజీ కేంద్రమంత్రి పవన్కుమార్ బన్సల్
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో లంచాల కేసులో ఆ శాఖ మాజీ మంత్రి పవన్కుమార్ బన్సల్ పేరును సిబిఐ సాక్షుల జాబితాలో చేర్చింది. ఆయన మేనల్లుడు విజయ్ సింగ్లాతో పాటు మరో 10 మంది పేర్లను సిబిఐ చార్జిషీట్లో చేర్చింది. దీంతో పాటు సిబిఐ తయారు చేసిన 90 మంది సాక్షలు జాబితాలో బన్సల్ను 39వ సాక్షిగా చేర్చింది.