41వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం-ఏబీవీపీ

గోడ పత్రిక విడుదల
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- ఏబీవీపీ రాష్ట్ర మహాసభల సందర్బంగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి వాల్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది.ఈ సందర్బంగా విభాగ్ కన్వీనర్ శ్రీరామ్ మాట్లాడుతూ… భారతదేశంలో ఏబీవీపీ అతిపెద్ద సంస్థగా ఎదిగి ఎన్నో విద్యార్థి సమస్యలపై పోరాటంచేస్తుందన్నారు.అంతేకాకుండా నేడు రాష్టంలో నెలకొన్న పలు సమస్యలపై పోరాడి విద్యార్థులకు న్యాయం చేస్తుంది అన్నారు.మహా సభలు ఈ నెల 9 నుంచి 11 తేదీ వరకు జగిత్యాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో యూనివర్సిటీ స్థితిగతుల పైన రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలపైన పలు తీర్మానాలు ప్రవేశపెట్టి రాబోయే రోజులలో పరిష్కారించే దిశగా ఏబీవీపీ కార్యాచరణ ఉంటుదన్నారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవ రెడ్డి,విభాగ్ టెక్నీకల్ సెల్ కన్వీనర్ సంతోష్,హాస్టల్స్ కన్వీనర్ జగదీశ్,ఎస్ ఎఫ్ డి కన్వీనర్ సందీప్ మహిళా నాయకులు వందన,మహేందర్,పవన్,గణేష్, శిరీష తదితరులు పాల్గొన్నారు.
యాచారం మండలం మల్ లో
విబాగ్ ఎస్ ఎఫ్ డి కన్వీనర్ దొంతగొని శివ కృష్ణ అధ్యర్యం లో వాల్ పోస్టర్ విడుదల చేసారు ఈ కార్యక్రమంలో నాయకులు జగదీశ్,భాస్కర్,మల్లేష్, శివాని తదితరులు పాల్గొన్నారు