యూపీఏ పాలన దేశానికి భారంగా మారింది

రాజకీయ తీర్మానంలో భాజపా

పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు పనాజీలో కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. గత నాలుగేళ్ళుగా భారతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని ఈ తీర్మానంలో భాజపా పేర్కొంది. రాజకీయ తీర్మానం పై పార్టీ ప్రతినిధి షానవాజు హుస్సేన్‌ మీడియాతో మాట్లాడారు. యూపీఏ పాలన దేశానికి భారంగా మారిందని తెలిపారు. యూపీఏ నాలుగేళ్ల ఉత్సవాలకన్నా ప్రజలకు క్షమాపణలు చెబితే మంచిదని అన్నారు. భాజాపా శ్రేణుల అభిమతాన్ని కార్యవర్గ సమావేశం విస్మరించదని చెప్పారు. పార్టీ కార్యవర్గ సమావేశాల ముగింపులో కీలక ప్రకటన ఉంటుందని హుస్సేన్‌ తెలిపారు.