వారం రోజుల్లో అంజలిని కోర్టులో హాజరు పరచండి

చెన్నై,(జనంసాక్షి): వారం రోజుల్లో సినీనటి అంజలి కోర్టులో హాజరుపరచాలని చెన్నై కోర్టు హెచ్చరించింది. గతంలో అంజలి కిడ్నాప్‌ ఉదంతానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్న కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా అంజలిని కోర్టులో హాజరు పరచడానికి వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు అంజలిని వారం రోజుల్లోగా కోర్టులో హాజరు పరచాలని తెలిపింది.