బీసీసీఐకి రైనా, జడేజా క్షమాపణలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అతిగా ప్రవర్తించిన రవీంద్ర జడేజా, సురేష్ రైనాలు బీసీసీఐని క్షమాపణలు కోరారు. జడేజా-రైనాల మధ్య వాగ్వాదం జరిగిన ఘటనపై బీసీసీఐ జట్టు యాజమాన్యం నుంచి విరమణ తీసుకుంది. బీసీసీఐ టీం మేనేజర్ శ్రీధర్తో మాట్లాడిన అనంతరం వారివురు బీసీసీఐకి క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై తీము విచారణ వ్యక్తం చేస్తున్నట్లు మేనేజర్కు తెలిపారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా సోమవారం మీడియాకు వివరన ఇచ్చారు. వారిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.