కాశ్మీరులో ఐదుగుర తీవ్రాదుల కాల్చివేత

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతో చొరబాటుకు యత్నించిన  ఐదుగురు తీవ్రవాదులను సైన్యం హతమార్చింది. మంగళవారం కుప్వారా జిల్లాలోని ఫర్మియాన్‌ గాలిలో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు తీవ్రవాదలు కాశ్మీరులోకి చొరబడేందుకు యత్నించగా భద్రతా బలగాలుఅడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రవాదుల హతమయ్యారని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. తొమ్మిది మంది నియంత్రణ రేఖ వద్ద సంచరిస్తున్నట్లు తెల్లవారుజామున బలగాలు గుర్తించాయని వెల్లడించారు. తీవ్రవాదులు హఠాత్తుగా కాల్పులకు తెగడడంతో సైన్య ధీటుగాస్పందించిందన్నారు.