విజయవాడలో కుప్ప కూలిన శిథిల భవనాలు

విజయవాడ : విజయవాడ పాతబస్తీ వించిపేటలోని రాంగోపాల్‌ సత్రం వీధిలో ఉన్న మూడు ఇళ్లు  బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్ప కూలాయి. ఈ ప్రమాదంలో ఒక ఇంట్లో ఉన్న రాజు అనే రిక్షా కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. దేవాదాయశాఖకు చెందిన ఈ మూడు గృహాలను కూల్చివేయాలని గతంలోనే నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. కానీ అధికారులు స్పందించలేదు. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ దుర్గాప్రసాద్‌ ఈ ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ…. అధికారుల అదేశాల మేరకు బుధవారం ఈ ఇళ్లను కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశామని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. క్షతగాత్రుడు రాజుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.