విరిగిపడిన కొండచరియలు

ముంబయి: ముంబయి నగరంలోని యాంటాప్‌ హిల్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురిని కాపాడారు. మరో ఐదుగురు విరిగిపడిన కొండ చరియల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. బీఎంసీ ఆధ్వర్యంలో 40మంది సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. మూడు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోందని, ఈ ప్రాంతంలో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయని స్థానికులు తెలిపారు.