ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు: ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. తాజాగా చమోలీ జిల్లా బిఖూలి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. కొండ చరియల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి వేలాది మంది మృతి చెందిన విషయం విదితమే.