అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించిన షిండే

బీహార్‌: బుద్ధగయ పేలుళ్ల ఘటనలో మావోయిస్టుల పాత్ర సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కేంద్ర హోం శాఖామంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. మహాబోధి అలయంలో పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు…. అప్రమత్తంగా ఉండాలని గతంలోనే బీహార్‌ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించినట్లు చెప్పారు. బుద్ధగయ పేలుళ్లపై ఎస్‌ఐఏ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు.