పెటా కోసం సానియా రాకెట్ వేలం
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఆటోగ్రాఫ్తో ఒక రాకెట్ను పెటా సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఈ బే ఆ రాకెట్ను వేలం వేయనుంది. వేలంపాటలో వచ్చిన మొత్తం సొమ్మును పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘యానిమల్ రాహత్’ ప్రాజెక్టుకు ఇవ్వనున్నారు. జంతువుల చేత పనిచేయించడాన్ని వ్యతిరేకించే పెటా అలా పనిచేస్తున్న జంతువుల సంక్షేమం కోసం యానిమల్ రాహత్ కార్యక్రమాన్ని చేపట్టింది. వెట్టి చాకిరీ చేసే గుర్రాలు, గాడిదలు, ఎడ్లు, కోతులు తదితర జంతువుల సంక్షేమం కోసం యానిమల్ రాహత్ కార్యక్రమాన్ని చేపట్టింది. వెట్టి చాకిరీ చేసే గుర్రాలు, గాడిదలు, ఎడ్లు, కోతులు తదితర జంతువుల సంరక్షణకు నిధులను ఉపయోగిస్తారు.