తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి: సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ అధిష్టానం చర్చలు సాగిస్తుందని చెప్పారు.
ప్రపంచ ప్రసిద్ద బౌద్ధ క్షేత్రం బుద్దడయలో చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనపై షిండే సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుద్ధగయ పేలుళ్లపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతుందని ఆయన తెలిపారు. ఈ పేలుళ్లకు హైదరాబాద్‌తో లింకుపై కూడా దర్యాప్తు సాగుతుందన్నారు.