పాత సచివాలయం ప్రాంగణంలో తగలబడుతున్న భవనం

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని పాత సచివాలయం ప్రాంగణంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండంతస్థుల భవనం పూర్తిగా అగ్నికి అహుతయ్యింది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.