విరిగిపడుతున్న కొండ చరియలు

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే ఘాట్‌ రోడ్డుపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఓ భక్తురాలికి గాయాలయ్యాయి. దీంతో ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కొండపైకి వెళ్లేందుకు దుర్గగుడి బస్సులు, పుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.