కేవీపీ ఇంట్లో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): హస్తినలో కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను కోర్ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్ర విభజన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజన ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చించామని తెలిపారు. అధిష్ఠాన పెద్దలను కలిసి తమ అభిప్రాయలను చెబుతామని ఆయన పేర్కొన్నారు.