లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉద్దీపన పథకాలు కొనసాగిస్తామన్న ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ బెర్నాంకె ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్‌మార్కెట్లు లాభాల బాట పట్టాయి.