కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన అధికారులు

విజయవాడ సబ్‌కలెక్టరేటు: కృష్ణా డెల్టాలోని తూర్పు ప్రధాన కాలువకు ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. విజయవాడ నీటి పారుదల శాఖ ఎస్‌ఈ కేఎల్‌ నరసింహమూర్తి గుంటూరు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రమేష్‌బాబు నీటి విడుదలను ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో కృష్ణాపశ్చిమ కాలువకు నీరు విడుదల చేస్తామని కృష్ణా డెల్టా సిస్టం చీఫ్‌ ఇంజినీర్‌ సాంబయ్య ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం కృష్ణా తూర్పు కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదిలినా క్రమేపి నీటి విడుదలను పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.