పొన్నం ప్రభాకర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ నేతలకు అల్పాహార విందు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఇవాళ పొన్నం తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అల్పహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నేతలు ఇవాళ్టి కోర్‌ కమిటీ సమావేశం, అనతంరం పరిణామాలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.