సీఎంతో సీమాంధ్ర ఎంపీలు, నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సెగ దేశ రాజధాని హస్తినను వేడెక్కిస్తుంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ రోజు సాయంత్రం భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు విడివిడాగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, మంత్రులు, నేతలు భేటీ అయ్యారు. కోర్‌ కమిటీ సమావేశంపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు సమావేశమై చర్చిస్తున్నారు. కాగా తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్‌ గజ్జెల కాంతం ఈ రోజు ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.