సహాయ చర్యలపై సీఎం సమీక్ష

ఢిల్లీ: రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అదేశించారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రులు దానం నాగేందర్‌, బాలరాజును కూడా సీఎం అదేశించారు.