ఏపీ భవన్ వద్ద బందోబస్తుతో పోలీస్
ఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే కాంగ్రెస్ కోర్కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముండటంతో ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో పాటు, రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఎపీ భవన్కు చేరుకోవడంతో ఎలాంటి అవాఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.