సోనియాతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం 10 జన్‌పథ్‌లో భేటీ అయ్యారు. నేడు కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. మరి కొద్ది గంటల్లో కోర్‌కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో 10 జన్‌పథ్‌లో అధినేత్రి సోనియాతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం కావడం రోడ్డు మ్యాపులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.