సోనియాతో ముగిసిన సీఎం కిరణ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అందుకు గల కారణాలను సీఎం కిరణ్‌ సోనియాకు వివరించినట్లు సమాచారం. అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీఎం కిరణ్‌కుమార్‌ను సోనియాగాంధీ ఆదేశించినట్లు తెలుస్తుంది.