ఆహారభద్రత బిల్లుపై నేడు సమీక్షించనున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆహార భద్రతా బిల్లుపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటకు జరగబోయే భేటీలో ఆమె కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రుల, పీసీసీ చీఫ్‌లు సీఎల్పీ నాయకులతో సమావేశమై ఈ బిల్లు ముసాయిదాపై చర్చించనున్నారు. ఆహార భద్రతా బిల్లు ప్రాముఖాన్ని ఆమె నేతలకు వివరించనున్నారు.