భారీ వర్షాలతో అతలాకుతలమవుతన్న ముంబయి
ముంబై,(జనంసాక్షి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లు, రోడ్లపై వర్షపు నీరు నిలచిపోయింది. దీంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు సకాలంలో కార్యాలయాలకు, స్కూళ్లకు వెళ్లలేక పోతున్నారు గత రెండు రోజులుగా ముంబై నగరంలో 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.