టెన్‌ జన్‌పథ్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స కు పరాభవం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): టెన్‌ జన్‌పథ్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు పరాభవం ఎదురైంది. శనివారం సోనియా గాంధీ నివాసంలో భద్రతపై ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల సీఎంతో పాల్గొనేందుకు బొత్స సత్యనారాయణ అక్కడికి వచ్చారు. అయితే అనుమతి లేదంటూ ఆయన్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆహార భద్రత సమావేశంలో పాల్గొనాలని తనకు ఫోన్‌ ద్వారా పిలుపు వచ్చిన సంగతిని ఈ సంద్భంగా బొత్స సోనియా నివాసంలోని భద్రతా సిబ్బందికి వివరించారు. అయిన బొత్సను సోనియా నివాసంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దాంతో చేసేది లేక బొత్స కాసేపు అక్కడే ఉండి అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు.