తెలంగాణపై నిర్ణయమే తరువాయి: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణపై ఇక సంప్రదింపులు ఉండవని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణపై ఇక నిర్ణయమే తరువాయి అని అయన వెల్లడించారు. త్వరలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.