దిగ్విజయ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోర్‌కమిటీ సమావేశం చర్చల సారాంశం భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే సీడబ్ల్యూసీ సమావేశం గురించి వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.