బాలీవుడ్ నటుడు ప్రాణ్ అంతిమ యాత్ర
ముంబయి,(జనంసాక్షి): అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రాణ్ (93) అంతిమయాత్ర ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అయిన ప్రాణ్ అంత్యక్రియలు ముంబయిలోని శివాజీ పార్క్లో జరగనున్నాయి. పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి నేరుగా శివాజీ పార్క్కు తీసుకెళ్తామని ఆయన కూతురు పింకీ తెలిపారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రాణ్ అభిమానులు, బాలీవుడ్ నటులు పాల్గొన్నారు.