దిగ్విజయసింగ్‌తో ముగిసిన భేటీ

ఢిల్లీ, (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయసింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల భేటీ ముగిసింది. వీరు దాదాపు 40 నిమిషాల పాటు దిగ్విజయసింగ్‌తో చర్చించారు. కొన్ని మార్పులతో కొత్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.