పంచాయతీ ఎన్నికల్లో హింస …. ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చోటుచేసుకుంది. బుర్‌ద్వాన్‌ జిల్లా మధుడంగా గ్రామ పంచాయతీ పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీపీఎం పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థి మనోహ్ర బీబీ భర్త మహమ్మద్‌ షేక్‌ హస్మత్‌ మృతి చెందాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హూగ్లీ, తూర్పు మిడ్నాపూర్‌, బుర్‌ద్వాస్‌ జిల్లాల్లోని 12,869 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.