రాహుల్‌గాంధీకి చివరి టెలిగ్రామ్‌

న్యూఢిల్లీ : 163 ఏళ్లుగా భారతీయుల జీవితంలో భాగంగా మారిన టెలిగ్రామ్‌ సేవలు నిన్నటితో ముగిశాయి. చివరి రోజు కావడంతో అదివారం రాత్రి వరకూ తమ ఆప్తులకు పలువురు టెలిగ్రామ్‌లను పంపించారు. దేశ రాజధానిలో చివరి టెలిగ్రామ్‌ను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఓ వ్యక్తి పంపాడు. జన్‌పథ్‌లోని సెంట్రల్‌ టెలిగ్రాఫ్‌ కార్యాలయంలో అశ్వని మిశ్రా అనే వ్యక్తి రాహుల్‌గాంధీతోపాటు డీడీ న్యూస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎం ఖాన్‌ల పేరిట టెలిగ్రామ్‌ను బుక్‌ చేశాడు. ఇదే చివరి టెలిగ్రామ్‌ అని అధికారులు తెలిపారు.