కేరళలో అదుపుతప్పిన బస్సు ఢీ:ఐదుగురి మృతి

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. చడాయమంగళం-ఆయూరు మార్గంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థక చెందిన బస్సు ఓ ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురిని తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.