నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులకు జరిమానా
ముంబై,(జనంసాక్షి): కెవైసి నిబంధనలు ఉల్లంఘించిన 22 బ్యాంకులకు ఆర్బిఐ జరిమానా విధించింది. 50 లక్షల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించారు. 2013 ఏప్రిల్లో బ్యాంకుల అకౌంట్లను ఆర్బిఐ పరిశీలించింది. ఈ పరిశీలనలో బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించినట్లు బయటపడుతుంది. దాంతో 22 బ్యాంకులకు జరిమానా విధించడంతోపాటు మరో 7 బ్యాంకులు జాగ్రత్తగా ఉండాల్సిన ఆర్బిఐ హెచ్చరించింది.