మోడీపై కాంగ్రెస్‌ తీవ్రంగా ఎదురు దాడి

ఢిల్లీ: లౌకికవాదంపై మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. లౌకికవాదం అంటే ఏమిటో భాజపా చెప్పాలి అని వారు విరుచుకుపడ్డారు. లౌకికవాదం అనేది అన్ని మతాలవారికీ వర్తిస్తుందని, హిందువులు, ముస్లింలు, సిక్కులు , జైనులు ….. అన్ని ధర్మాలను అచరించేవారూ లౌకికవాదులుగా ఉంటారిన కాంగ్రెస్‌ నేత, కేంద్ర మంత్రి మనీష్‌ తివారీ అన్నారు. కమ్యూనలిజం మాత్రం సమాజాన్ని విడదీస్తుందని, వాళ్ల భాషలో కుక్కపిల్లలుగా భావించేవారిని ఆ కమ్యూనలిజం కింద నలిపేస్తారని మనీష్‌ పేర్కొన్నారు. అ రెంటి మధ్య ప్రజలకు ఏది మేలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.