అనుమానంతో అదుపులోకి తీసుకున్న భారీ నగదు

కర్ణాటక : కర్ణాటలోని దావణగేరె ప్రాంతంలో కెంచమ్మ అనే యాచకురాలి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మూటల కొద్దీ డబ్బు చూసి అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులకు అదంతా తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బేనని కెంచమ్మ స్పష్టం చేసింది. అర్థరూపాయి, రూపాయి నాణేలు, రూపాయి, ఐదు రూపాయి నోట్లు…. అన్నీ కలిసి రెండు లక్షల రూపాయలపైనే కెంచమ్మ కూడబెట్టింది. అదంతా ఆమె స్వార్జితమేనని నిర్ధారించుకున్నాక ఆమె డబ్సు ఆమెకే అప్పజెబుతామని పోలీసులు తెలిపారు.