మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకున్న సుప్రీంకోర్టు

ఢిల్లీ: బార్లలో నృత్యాలను నిషేధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. బార్లలో మహిళా నృత్యాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో తాము ఉపాధికోల్పోతున్నామని మహిళా డ్యాన్సర్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈమేరకు తన తాజా తీర్పు వెల్లడించింది.